Friday, April 26, 2024

Sports: ప్రిన్సెన్​ వాలీబాల్​ కప్​లో అమ్మాయిలు అదుర్స్.. మలేషియాపై 3.0తో గెలిచిన ఇండియా

థాయ్‌లాండ్‌లోని నఖోన్ పాథోమ్‌లో జరుగుతున్న 21వ ప్రిన్సెస్ కప్‌లో భాగంగా జరిగిన తన ప్రాథమిక మూడో లీగ్ మ్యాచ్‌లో భారత సీనియర్ మహిళల వాలీబాల్ జట్టు 3-0తో మలేషియాను ఓడించింది. స్కోర్లు 25-17 25-16 25-22 భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. జూన్ 24న ప్రారంభమైన ఈ టోర్నీ జూన్ 30వ తేదీన ముగియనుంది.

కాగా, భారత్ తరఫున అటాకర్ అనుశ్రీ కేపీ, బ్లాకర్ సూర్య గోల్స్ తో మెరిశారు. చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో విజయం సాధించిన జట్టును వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్‌ఐ) ప్రెసిడెంట్ అచ్యుత సమంత అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement