Friday, March 29, 2024

డ్రగ్స్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు : ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌

హైదరాబాద్ గచ్చిబౌలిలోని నడక కోసం మాతో చేరండి (JOIN US FOR THE WALK)వారి ఆధ్వర్యంలో నిర్వహించిన To SAY ‘NO’ To Drugs To SAY ‘YES’ To WALK కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ సీఎం కేసీఆర్ డ్రగ్స్ నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నార‌న్నారు. తెలంగాణలోని యువత మద్యానికి, డ్రగ్స్ కి బానిసలుగా మారకుండా ఉండాలని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అన్నారు.

హైదరాబాద్ లో వాయు కాలుష్య నివారణకు హాని కలగకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా అందరూ ఒక్క మొక్కను నాటి ఆ ఒక్కరు ముగ్గురితో మొక్కలు నాటించాలని కోరారు. గ‌త పాల‌కులు యువతను పట్టించుకున్న దాఖలాలు లేవ‌న్నారు. ఈ కార్యక్రమంలో తల్లడ సాయికృష్ణ, బొగ్గరపు శరత్ చంద్ర, నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement