Tuesday, May 21, 2024

IND VS NZ Semi Final: భారత్ ధనాధన్ బ్యాటింగ్.. కివీస్ టార్గెట్ ఎంతంటే..

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

భారత్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ 117 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 105 పరుగులు, శుభమాన్ గిల్ 80 పరుగులు, రోహిత్ శర్మ 47 పరుగులు చేశారు. భారత్ బ్యాట్స్ మెన్లు ఇద్దరు సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ కు బిగ్ టార్గెట్ ను ఉంచింది. న్యూజిలాండ్ విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 398 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement