Tuesday, April 30, 2024

Ind vs Eng, 5th Test : లంచ్ బ్రేక్… ఇంగ్లండ్ స్కోర్ 100/2

ధర్మశాలలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ ఓపెనర్ బ్లెన్ డక్కెట్ 27పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, ఒల్లీ పోప్ 11 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాక్ క్రాలే 61 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. దీంతో లంచ్ బ్రేక్ కు ఇంగ్లండ్ జట్టు 25.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement