Friday, April 26, 2024

దక్షిణాఫ్రికా సిరీస్‌కు హర్షల్‌ దూరం.. చేతి గాయమే కారణం

భారత్‌ యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌కు గాయమైంది. దీంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పటేల్‌ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీకి ముందే భారత్‌కు ఇది షాకింగ్‌ న్యూసే.. గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ చేతికి గాయమైంది. దీంతో ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్‌ బౌలింగ్‌ మాత్రమే వేశాడు. ఆ తరువాత ఫీల్డింగ్‌ నుంచి వీడాడు. భారత్‌ తుది జట్టును 25వ తేదీన ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా వైదొలిగాడు. ఐపీఎల్‌కు కూడా అర్ధాం తరంగా దూరం అయ్యాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజాలు కూడా ఐపీఎల్‌ టోర్నీని గాయాల కారణంగా మధ్యలోనే వదిలేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement