Wednesday, May 1, 2024

ప్రాగ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేత హరికృష్ణ

ముంబై: భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ప్రాగ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. చెక్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న చెస్‌ టోర్నీలో 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రాండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన మ్యాచ్‌లో హరికృష్ణ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. స్పెయిన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ డేవిడ్‌ ఆంటోన్‌ గిజారోతో జరిగిన ఆఖరి తొమ్మిదో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి ప్రాగ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను డ్రా చేసుకుని అజేయంగా నిలిచాడు. ప్రాగ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్‌తోపాటు రూ.82 వేల ప్రైజ్‌మనీ కూడా అందుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement