Monday, April 29, 2024

First Test రాహుల్ అద్భుత సెంచరీ…245 ప‌రుగుల‌కు భార‌త్ అలౌట్

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 133 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. రాహుల్ 101 పరుగులు చేసి చివ‌రి వికెట్ గా వెనుతిరిగాడు…

అంత‌కు ముందు నేటి ఉద‌యం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ 238 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సిరాజ్ కోయట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివ‌ర‌గా రాహుల్ వికెట్ బ‌ర్గ‌ర్ ప‌డ‌గొట్టి భార‌త్ ఇన్నింగ్స్ కు తెర‌దించాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement