Monday, April 29, 2024

AP Crime News – వీరులపాడులో భార్య …గుంటుప‌ల్లిలో బీహారి హ‌త్య‌….

ప్రభన్యూస్, వీరులపాడు – ఎన్టీఆర్ జిల్లా , వీరులపాడులో తన భార్య కాపురానికి రావటం లేదని ఆక్రోశంతో ఓ భర్త హంతకుడిగా మారిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వీరులపాడు మండల కేంద్రానికి చెందిన బంకా మేరీ, సుందర్ రావు దంపతులు. ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్య కాపురానికి రావడం లేదని మంగళవారం రాత్రి మద్యం మత్తు లో మేరీని గొంతు కోసి సుందరరావు హత్యచేసి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటుపల్లిలో బీహారీ హత్య

ఇబ్రహీంపట్నం ప్రభ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని హతమార్చారు. గుంటుపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలో హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు గుర్తించారు. హతుడు బీహారీగా వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పత్తిరైతు ఆత్మహత్య …

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం నరసింహారావు పాలెం గ్రామంలో పత్తి రైతు గల్లా చిన్నపున్నయ్య(38) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుమందు తాగిన రైతును విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెంచాడు. చిన పున్నయ్యకు ముగ్గురు పిల్లలు. కాగ పత్తి పంట దెబ్బతినటంతో అప్పుల బాధను గుర్తు చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికుల సమాచారం.

- Advertisement -

వ‌రి నూర్పిడి యంత్రం కింద ప‌డి ఇద్ద‌రి మృతి..

విజయనగరం జిల్లా తెర్లాం మండలం అంట్లవార గ్రామంలో వరి నూర్పిడి యంత్రం కింద పడి ఇద్దరు మృతి చెందారు.. మరో ఇద్దరికి గాయాల‌య్యాయి.. మృతి చెందిన వారు గంప రమణమ్మ, బోనాసి జానకి గా గుర్తించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement