Monday, April 29, 2024

Final Fight – భార‌త్ – ఆసీస్ పోరుకు చీఫ్ గెస్ట్ లు గా భార‌త‌, ఆస్టేలియా ప్ర‌ధానులు ….

2023 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్, ఆస్ట్రేలియా జట్లు వచ్చేసాయి. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. లక్ష 30 వేల సామర్ధ్యం కలిగి ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కు పలు సెలబ్రిటీలతో పాటు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాని అల్బనీస్ కలిసి భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించానున్నారు.

ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మ్యాచ్ కు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై సెమీస్ లో గెలిచి ఫైనల్ కి వెళ్లడంతో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఈ మ్యాచ్ చూసేందుకు భారత్ కు వస్తున్నార‌ని ఆస్ట్రేలియా స‌మాచారం ఇచ్చింది.. ఆయ‌న మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ చేరుకుంటారు. ఈ ఏడాది భారత్ ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ సందర్భంగా ఈ ఇద్దరు ప్రధానులు మ్యాచ్ ను చూసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్ ను చూసేందుకు వస్తుండడంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement