Sunday, April 28, 2024

Stay – జ‌గ‌న్ స‌ర్కార్ కు షాక్ … ఎస్‌ఐ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

అమరావతి: ఎస్‌ఐ నోటిఫికేషన్‌ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు. బాధితుల తరఫున జడ శ్రావణ్‌ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్‌ కోరారు. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement