Friday, May 3, 2024

AP: గన్నవరంలో రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.

ఏపీ సీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీలతో పాటు పలువురు నాయకులు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఏపీలోనే తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం తరలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement