Saturday, May 4, 2024

Tennis | పాక్‌లో డేవిస్‌ కప్‌-2024.. ఆరుగురుతో భారత జట్టు రెఢీ

ఇస్లామాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 3-4 తేదీల్లో జరుగనున్న డేవిస్‌ కప్‌ 2024 వరల్డ్‌ గ్రూప్‌ ప్లే-ఆఫ్‌ టై మ్యాచ్‌ల కోసం అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఆరుగురు సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. యుకి భంబ్రి, రామ్‌కుమార్‌ రామనాథన్‌, ఎన్‌.శ్రీరామ్‌ బాలాజీ, సాకేత్‌ మైనేని, నిక్కి కలియండ పూనాచ, దిగ్విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌లను ఎంపిక చేసినట్లు ఏఐటీఏ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇస్లామాబాద్‌కు వెళ్లే టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న లేకపోవడం విశేషం. మాజీ క్రీడాకారుడు రోహిత్‌ రాజ్‌పాల్‌ ఇండియన్‌ డేవిస్‌ కప్‌ నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌గా కొనసాగనుండగా, జీషన్‌ అలీ కోచ్‌గా వ్యవహరించనున్నారు. 1964 తర్వాత తొలిసారి పాకిస్తాన్‌కు ఇండియన్‌ డేవిస్‌ కప్‌ టీమ్‌ వెళ్లనుంది. 2019లో తటస్థ వేదికపై భారత్‌- పాకిస్తాన్‌ తలపడగా 4-0తో భారత జట్టు విజయం సాధించింది. దాదాపు 8 సార్లు ఇరు జట్లు తలపడగా, ఒక్కసారి కూడా భారత ఓటమినెరుగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement