Thursday, May 16, 2024

రేపటి నుంచి క్రికెట్ పండుగ‌.. ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టేది ఎవ‌రో?

క‌రోనా మ‌హ‌మ్మారితో సంబురాలు, సంతోషాల‌ను కోల్పోయిన జ‌నాలంతా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. అన్నిప‌నులు మెల్ల‌మెల్ల‌గా ప్రారంభం అవుతుండ‌డంతో లైఫ్ మ‌ళ్లీ నార్మ‌ల్ అవుతోంది. అయితే క్రికెట్ అంటే ఎన‌లేని అభిమానం చూపే ఇండియ‌న్స్‌కి ఈసారి మాంచి కిక్ ఇచ్చేలా పొట్టి క్రికెట్ పండుగా రానే వ‌చ్చింది. సిక్సర్లు, ఫోర్ల వర్షం ఇక రేప‌టి నుంచి మొదలుకానుంది. తొలి రోజు మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ఆట‌గాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ఇక‌ కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఫ‌స్ట్ మ్యాచ్‌లో తలపడనుంది.

గత సీజన్‌లో ఇరు జట్లు ఫైనల్‌లో తలపడగా చెన్నై ఏకపక్షంగా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది గతానికి సంబంధించిన విషయం. ప్రస్తుత జట్లు, సార‌థ్యంలో చాలా మార్పులు వచ్చాయి. చెన్నై, కోల్‌కతా మధ్య గట్టి పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రెండు జట్లు అద్భుతంగా కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడి పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేయడం వారికి ఈజీ అనుకోవ‌డంలో సందేహం లేదు. మరోవైపు యువ ఆటగాళ్లతో కూడిన కోల్‌కతా జట్టు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో రంగంలోకి దిగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఐపీఎల్‌లో జరగబోయే తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఎలా రాణిస్తున్నాయో ఓసారి ప‌రిశీలిద్దాం..

తొలి మ్యాచ్‌లో చెన్నై రికార్డులు..
చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ, మొదటి మ్యాచ్‌లో వారి రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు. చెన్నై ఇప్పటి దాకా 12 సార్లు ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లు ఆడగా 6 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచులు ఓడింది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు 50 శాతంగా ఉంది. మరోవైపు కేకేఆర్ జ‌ట్టు 14 ఓపెనింగ్ మ్యాచ్‌లలో 10 సార్లు గెలిచింది. అంటే మొదటి మ్యాచ్‌లో విజయం సాధించడంలో సీఎస్‌కే కంటే కేకేఆర్ ముందుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి ఐదు మొదటి మ్యాచ్‌లలో 4 గెలిచింది. కేవలం ఒక మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొంది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఈ ఓటమిని పొందింది.

తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ ప్రదర్శన..
కేకేఆర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు తమ 10 ఓపెనింగ్ మ్యాచుల‌ను గెలుచుకుంది. 2013 నుంచి 2019 వరకు వారు తమ మొదటి మ్యాచ్‌లను వరుసగా 7 సార్లు గెలుచుకుంది. 2020లో ముంబై ఇండియన్స్ చేతిలో 49 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఇంతకు ముందు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై, కేకేఆర్ టీమ్‌లు ఒక్కసారి మాత్రమే ఢీకొన్నాయి. ఈ మ్యాచ్‌లో సీస్‌కే టీమ్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ 2011లో చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement