Monday, April 29, 2024

నేషనల్ టీ-20 క్రికెట్ కి జెస్సి ప్రసన్న ఎన్నిక..

ప్రత్తిపాడు, ప్రభన్యూస్ : నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం చిన్న కొండ్రుపాడు గ్రామానికి చెందిన వాసిమళ్ల జెస్సి ప్రసన్న 8వ ఆల్ ఇండియా నేషనల్ టీ-20 క్రికెట్ చాంపియన్ షిప్ కు ఆడడానికి మన రాష్ట్రం తరుపున సెలక్ట్ అయ్యాడు. బెంగుళూరులో ఏప్రిల్ 16, 2022న జరిగే ఆల్ ఇండియా నేషనల్ క్రికెట్ టీ-20 ఛాంపియన్షిప్ కు సెలక్ట్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ అమరావతి క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అతని తల్లిదండ్రులు, చిన్న కొండ్రుపాడు గ్రామస్థులు, మండల స్థాయిలో పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

Vasimalla Jesse Prasanna

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement