Monday, April 29, 2024

ఎమ్మా రాడుకానుకు కరోనా పాజిటివ్‌..

యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌, బ్రిటన్‌ టీనేజ్‌ టెన్నిస్‌ సంచలనం ఎమ్మా రాడుకానుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తనకు వైద్యపరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణౖందని ఎమ్మా వెల్లడించింది. అబుదాబి వేదికగా త్వరలో ప్రారభమయ్యే ముబాదల వరల్డ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఎమ్మా పాల్గొనాల్సి ఉండగా కరోనా పాజిటివ్‌గా తెలియడంతో వైదొలిగింది.

19ఏళ్ల ఎమ్మా ఈ టోర్నీలో ఒలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణపతక విజేత బెలిండా బెన్సిక్‌తో తలపడాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా తప్పుకుంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మా తెలిపింది. కాగా ఎమ్మా రాడుకాను 2021 బీబీసీ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారానికి నామినేట్‌ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement