Friday, May 3, 2024

సీబీఐ అధికారుల‌మంటూ ఓ ఇంటిని లూటీ చేసిన దొంగ‌లు

న‌గ‌రంలో దోంగ‌త‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. దొంగ‌లు ర‌క‌ర‌కాలుగా దోపిడీ చేస్తున్నారు. న‌గ‌రంలోని గచ్చిబౌలి నానక్ రాంగూడలో ఓ దొంగ‌ల ముఠా తాము సీబీఐ అధికారులమంటూ మీ ఇంటిని సోదాలు చేయాలంటూ దొంగలు ఇంటిని గుల్ల చేసారు. ఒక కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దొంగ‌లు దోచుకెళ్లారు. గచ్చిబౌలి పీఎస్ పరిది నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జయభేరి ఆరెంజ్ కౌంటి ప్లాట్ నెంబర్ 110 లో భాగ్యలక్ష్మి ఉంటున్నారు. అయితే ఆ ఇంటికి వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. సీబీఐ అధికారులమంటూ ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మిని పరిచయం చేసుకున్నారు. అయితే ఆ దుండ‌గులు దాదాపు గంటన్నర వరకు ఇంట్లో ఉన్నలాకర్ కీస్ తీసుకుని 1 కేజీల 44 గ్రాముల బంగారంతో పాటు 2 లక్షల ఎత్తుకెళ్లారు. దీంతో దొంగ‌లు దోచుకెళ్ల‌డంతో భాగ్య‌ల‌క్ష్మీ బోరున విల‌పించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement