Sunday, May 19, 2024

INDvsENG Test | మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌..

భార‌త్ ఇంగ్లండ్ జ‌ట్ల ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారగంగా ఈ నెల 15న మూడవ టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జరిగిన రెండు టెస్టుల్లో 1–1 విజయంతో సమానంగా ఉన్నాయి భారత్, ఇంగ్లండ్ జట్లు. కగా, టీమ్ఇండియాతో మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ జాక్ లీచ్ మోకాలికి గాయం కారణంగా మిగిలిన టెస్టు సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్ర‌క‌టించింది.

హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో లీచ్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడ‌లేదు. అత‌డు కోలుకుని మూడో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌స్తాడ‌ని భావిస్తుండ‌గా సిరీస్ మొత్తానికే దూరం కావ‌డం ఇంగ్లాండ్ జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అత‌డి బ‌దులు మ‌రో ఆట‌గాడిని ఎంపిక చేయ‌డం లేద‌ని ఈసీబీ చెప్పింది. మెరుగైన చికిత్స కోసం అత‌డు స్వ‌దేశానికి వెళ్లనున్నట్టు తెలిపింది. కొన్ని రోజుల రిహాబిలిటేష‌న్‌లో ఉంటాడు అని ఈసీబీ వెల్లడిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement