Friday, May 17, 2024

Cricket: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల‌తో టీమిండియా మ్యాచ్‌లు.. సిరీస్​ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

ఆసియా కప్ జరిగిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో స్వదేశంలో సిరీస్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంతకుముందే ప్రకటించింది. లేటెస్ట్​గా ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. టీమిండియా మొదటగా ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఇక.. రెండో టీ20 నాగ్‌పూర్‌లో, మూడో టీ20 హైదరాబాద్‌లో ఉంటుందని బీసీసీఐ తెలిపింది. అలాగే సౌతాఫ్రికా సిరీస్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. సఫారీలతో మూడు టీ20లు ఆడుతుండగా.. అవి వరుసగా తిరువనంతపురం, గువాహతి, ఇండోర్ స్టేడియాల్లో జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement