Monday, May 20, 2024

IND-SA TEST | భారత్‌కు మరో షాక్‌.. టెస్టు మ్యాచ్‌కు ఇషాన్ దూరం !

టీమిండియా ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ముగించుకున్న భార‌త్.. మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జ‌రిగిన‌ తొలి వ‌న్డేలోశుభారంభం చేసంది. కాగా, డిసెంబ‌ర్ 26 నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. ఈ టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

టెస్టు సిరీస్ కోసం ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. తాజాగా ఈ జ‌ట్టు నుంచి యువ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్‌ను త‌ప్పించింది. అత‌డి స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భ‌ర‌త్‌కు అవ‌కాశం ఇచ్చింది. ఈ విష‌యాన్ని బీసీసీఐ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు త‌న‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని ఇషాన్ కిష‌న్ కోర‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే టెస్టు సిరీస్‌కు ఎంపికైన మ‌హ్మ‌ద్ ష‌మీ గాయంతో బాధ‌ప‌డుతుండ‌డంతో అత‌డి కూడా త‌ప్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement