ఆసియా కప్లో భాగంగా ఇవ్వాల (గురువారం) భారత్, అఫ్గాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అప్గాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి దాకా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్గాన్ సారధి మహమ్మద్ నబీ కూడా బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే..
తాము ముందుగా బ్యాటింగ్ చేసి తమను తాము ఛాలెంజ్ చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా సారధి కేఎల్ రాహుల్ చెప్పాడు.
వరల్డ్ కప్లో ఆడే ఆటగాళ్ల పాత్రలను ఫైనలైజ్ చేసేందుకు యత్నిస్తున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, చాహల్కు రెస్ట్ ఇచ్చారు. వీరి స్ధానంలో దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ ఆడుతున్నారు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్