Saturday, May 4, 2024

3rd ODI : ఆసీస్ భారీ స్కోర్… భారత్ టార్గెట్ 353 పరుగులు

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 352 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లు మిట్చెల్ మార్ష్ 96 పరుగులు, స్టీవెన్ స్మిత్ 74 పరుగులు, లబూషేన్ 72 పరుగులు, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేశారు. దీంతో ఆసీస్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 353 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement