Saturday, April 27, 2024

Kangana Ranaut : స్క్రీన్ టు పొలిటిక్స్…మండి లోక్ స‌భ బ‌రిలో బాలీవుడ్ క్వీన్

ఇన్నాళ్లు బాలీవుడ్ శ‌త్రువ‌ర్గంపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన కంగ‌న‌, ఇక‌పై రాజ‌కీయ శ‌త్రువుల‌పైనా విరుచుకుప‌డాల్సిన సన్నివేశం వ‌చ్చేసింది. ఎట్ట‌కేల‌కు కంగ‌నకు ఎంపి అయ్యే యోగం క‌నిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఐదవ జాబితాను విడుదల చేయ‌గా, ఈ జాబితాలో కంగ‌న పేరు ఉంది.

- Advertisement -

111 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుండి నటి కంగనా రనౌత్ భాజ‌పా ఎం.ఎల్.ఏ అభ్య‌ర్థిగా పోటీకి దిగుతోంది. తనను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిమాని అని పదే పదే చెప్పుకునే కంగనా రనౌత్‌కి ఇది ఎన్నికల అరంగేట్రం. ఇటీవ‌లే రామ మందిర శంకుస్థాపనలోను కంగన పాల్గొన్నారు.

తాజాగా X (గతంలో ట్విటర్)లో కంగనా మండి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించింది. అధికారికంగా పార్టీలో చేరడం గౌరవంగా భావిస్తున్నానని క్వీన్ అన్నారు. ”నా ప్రియమైన భారత్ ..భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతును కలిగి ఉన్నాయి. నేడు బిజెపి జాతీయ నాయకత్వం.. నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్, మండి (నియోజకవర్గం) నుండి 2024 లోక్‌సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది.

ఎన్నికల్లో పోటీ చేయడంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీలో అధికారికంగా చేరడం నాకు గౌరవంగా ఆనందంగా భావిస్తున్నాను. నేను ఒక విలువైన కార్యకర్త, నమ్మకమైన ప్రజా సేవకురాలిగా బ‌రిలో దిగేందుకు వేచి చూస్తున్నాను” అని కంగ‌న‌ రనౌత్ పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement