Monday, April 29, 2024

తిరుత్త‌ణి శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామికి – వెంక‌న్న‌స్వామి త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు అంద‌జేసిన వైవీ సుబ్బారెడ్డి

త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణి శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ వేడుకల్లో భాగంగా సుబ్ర‌హ్మ‌ణ్వేశ్వ‌ర స్వామికి తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి త‌ర‌ఫున‌ టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స‌తీస‌మేతంగా హాజరై ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కరోనా నుంచి దేశం విముక్తి పొంది ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీ సుబ్రమణ్య స్వామిని ప్రార్థించిన‌ట్లు ఆ త‌ర్వాత సుబ్బారెడ్డి తెలిపారు. ఆడికృత్తిక కావడి మహోత్సవ వేడుక సందర్భంగా తనపల్లిలోని శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారికి చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంత‌రం భ‌క్తుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాలుపంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement