Friday, May 3, 2024

AP | కోన‌సీమ‌ను వైసీపీ క‌ల‌హీల సీమ‌గా మార్చింది : ప‌వ‌న్

పచ్చని అందమైన కోనసీమను వైసీపీ ప్రభుత్వం కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించిందని ప‌వ‌న్ క‌ళ్యాన్ మండిపడ్డారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి త్రివేణి సంగమంలా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాయని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. యువతకు భరోసా ఇవ్వడానికి, ఈ ప్రాంతానికి కొబ్బరి బోర్డు తీసుకురావడానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి. 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు, రైతు కన్నీరు తుడిచేలా కూటమి అండగా నిలుస్తుంది. రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయి అని పవన్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement