Monday, May 6, 2024

వైఎస్ వివేకా హత్య కేసు.. సునీల్‌కు నార్కో పరీక్షలపై విచారణ వాయిదా

సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలపై విచారణ మరోమారు వాయిదా పడింది. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టులో పది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో శుక్రవారం నాడు 45 నిమిషాలపాటు ఆన్‌లైన్‌ ద్వారా ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు, ఇదే కేసులో మరో అనుమానితుడైన వివేకా డ్రైవర్ దస్తగిరితో వాంగ్మూలం ఇప్పించేందుకు శుక్రవారం నాడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. అక్కడ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో దస్తగిరిని తిరిగి కడప జైలు గెస్ట్ హౌస్‌కు తీసుకొచ్చారు.

ఈ వార్త కూడా చదవండి: జగన్ పెళ్లి రోజు సందర్భంగా భారీ కటౌట్ పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement