Thursday, May 2, 2024

AAGRA : ఆగ్రాలో దారుణం… పట్టపగలే యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. 25 ఏళ్ల బాధితురాలి వీడియోను గతంలోనే చిత్రీకరించారు. దానిని చూపించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధిత యువతితో మద్యం తాగించిన నిందితులు ఆ తర్వాత ఆమె తలపై గాజు సీసాను పగలగొట్టారు. సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియో వైరల్ అయినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం ఆరోపణలతోపాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement