Friday, May 3, 2024

సూర్యాపేట జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నేరేడుచర్ల మండలం రాజీవ్ నగర్ సమీపంలో ఓ యువతి గొంతు కోసి నిందితుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నేరేడుచర్ల మండలం రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని ఖాళీ స్థలాలు గుడిసెలు వేసుకుని గంగిరెద్దుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అందులో ఉంటున్న ఒక యువతి సానికొమ్ము కళ్యాణిని (18) అదే కాలనీకి చెందిన బత్తుల బాల సైదులు (21) కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు.

అయితే యువకుడి ప్రేమను యువతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం బట్టలు ఉతకడానికి పక్కనే ఉన్న ఎంఎస్పీ కాల్వకు వెళుతుండగా ఆమె రాకను గమనించిన యువకుడు.. కళ్యాణిని పిలిచాడు. దీంతో ఆమె గొంతును షేవింగ్ బ్లేడుతో కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కళ్యాణిని స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రైవేట్ కాలేజీలో యువతి ఉన్న సమయంలో బాల సైదులు అనే యువకుడు ఆమె గొంతు కోసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement