Wednesday, April 24, 2024

15 నెలల్లో అంబేద్కర్ విగ్రహం సిద్ధం: మంత్రి కొప్పుల

హైదరాబాద్ నిర్మిస్తున్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్రహం భాగ్యనగరానికి దిక్సూచిగా ఉండబోతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం అంబేద్కర్ విగ్ర‌హ పనులను మంత్రి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని 15 నెల‌ల్లో ఏర్పాటు చేస్తామ‌న్నారు. విగ్ర‌హం వ‌ద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాల‌రీ, గ్రంథాల‌యం కూడా ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. విగ్ర‌హ ఏర్పాటుతో పాటు ఇత‌ర ప‌నుల‌కు ప్రభుత్వం రూ. 100 కోట్ల‌ ఖర్చు చేస్తోందని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement