Thursday, April 25, 2024

వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే

తూ.గో. జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లోనే కరోనా టీకా తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైద్య సిబ్బందిని తన ఇంటికి పిలిపించుకుని ఎమ్మెల్యే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రధాని మోదీనే స్వయంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కరోనా టీకా తీసుకుంటే.. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాత్రం ఇంట్లో వ్యాక్సిన్ తీసుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అధికార దర్పం చూపడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అటు సీఎం జగన్ కూడా సతీసమేతంగా గుంటూరు వెళ్లి కరోనా టీకా తీసుకున్న సంగతి తెలిసిందే. ఉన్నత స్థాయి నేతలకు లేని బడాయి ఎమ్మెల్యేకు ఎందుకు అని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement