Thursday, April 18, 2024

9వ వార్డు సభ్యుడిపై అనర్హత వేటు..

తంగళ్లపల్లి: మండల కేంద్రంలోని 9 వార్డు సభ్యుడిని అనర్హుడిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డ్‌ సభ్యులు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని 9 వార్డులో ఎన్నిక నిర్వహించేందుకై అధికారులు వార్డులోని సభ్యుల ఓటర్‌ జాబితా సిద్ధం చేశారు. అయితే ఈ జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని, ఇతర వార్డులలోని ఓటర్లను ఈ జాబితాలో చేర్చారని, ఈ జాబితాను వెంటనే సవరించి, కొత్త జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్‌ కుమార్‌ ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement