Sunday, April 28, 2024

Ind vs Ban | తొలి వన్డేలో విమెన్స్​ జట్టుకు ఎదురు దెబ్బ‌.. 40 పరుగుల తేడాతో భారత్​ ఓటమి

ఐసీసీ ఛాంపియన్షిప్ లో భాగంగా బంగ్లాదేశ్, భార‌త్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో.. టీమ్ ఇండియా విమెన్స్​ జట్టు ఓటమి పాలైంది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో భార‌త్ పై గెలిచి సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 153 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ స్మృతి మందానా మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత భారత్ క్రమంగా వికెట్లు కొల్పోయింది.

ఓపెనర్ ప్రియా పునియా, కెప్టెన్ హర్మన్, యస్తికా భాటియా, జెమిమా నలుగురు ఔట్ అవ్వడం వల్ల టీమ్ ఇండియా మరింత ఒత్తిడిలో పడింది. దీంతో భారత్ 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ త‌రువాత‌ వరుసగా వికెట్లు పడడం వల్ల 35.5 ఓవర్లలో 113 పరుగులకు టీమ్ ఇండియా ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరూఫా అక్తర్ 4, రబియా ఖాన్ 3, నహీదా అక్తర్, సుల్తానా తలో వికెట్ తీశారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement