ఒమన్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ 5 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు అదరకొడుతోంది. ఈ టోర్నీలో అజేయంగా దూసుకుపోతున్న భారత్.. ఇవ్వాల (శుక్రవారం రాత్రి) సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచి ఫైనల్స్కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 3–6 పాయింట్ల తేడాతో గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో ముగిసే సరికి 2–2 పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్లో భారత్ రెచ్చిపోవడంతో మరో నాలుగు గోల్స్ చేయగలిగింది. దీంతో సౌతాఫ్రికాను 3–6 తేడాతో ఓడించింది భారత మహిళలు జట్టు. ఫస్ట్ హాఫ్లో ఆడారు ధేకలే అక్షత అబాసో, కుజుర్ మరియానా గోల్స్ చేయగా.. సెకండ్ హాఫ్లోఖాన్ ముంతాజ్, రుతజా దాదాసో పిసల్, ఛత్రి జ్యోతి, కుజుర్ అజ్మీనా ఒక్కో గోల్స్ చేశారు.
ఇక రేపు (శనివారం) మహిళల హాకీ 5 ప్రపంచకప్ ఫైనల్స్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడనుంది.