Thursday, May 2, 2024

TS: మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి – గ‌వ‌ర్న‌ర్..

హైద‌రాబాద్ – మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాద‌ని, ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైద‌రాబాద్ లోని బిట్స్ పిలాని కళాశాలలో జ‌రిగిన వీ ఫర్ యూ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్ర‌సంగిస్తూ… మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. అనంత‌రం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్, బాలీవుడ్ నటి, మోటివేషనల్ స్పీకర్ తానాజ్ ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ సోషలిస్ట్, ఫిట్‌నెస్ అండ్ కాన్షియస్ లివింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శిల్పా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement