Saturday, May 4, 2024

సిఫాంగ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం – బాలింతపై అత్యాచారం

గుహవాటి – చంటి బిడ్డతో కలిసి రైలు ప్రయాణం చేస్తున్న ఓ మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. అస్సాంలోని గుహవాటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్‌ వెళ్లే..సిఫాంగ్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ తన బిడ్డతో పాటు అస్సాంలోని గుహవాటిలో రైలు ఎక్కింది. రైలు ఫకీరాగ్రామ్‌ వచ్చేసరికి బోగీ దాదాపు ఖాళీ అయింది. దీంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాంకు చెందిన అబ్దు (25), మొయినుల్‌ హక్‌ (26) బాధిత మహిళను కట్టేసి, కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. తమకు సహకరించకపోతే చిన్నారిని రైలు నుంచి బయటకు విసిరేస్తామని బెదిరించి మరీ అఘాయిత్యానికి ఒడిగట్టారు.

రైలు అలీపుర్‌ద్వార్‌ జంక్షన్‌కు వచ్చాక బాధితురాలు రైల్వే పోలీసులను ఆశ్రయించింది. పోలీసు బృందాలు శనివారం రాత్రి నిందితులను అరెస్ట్‌ చేశాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement