Thursday, May 2, 2024

తెలంగాణలో వైన్ షాపుల లైసెన్స్ గడువు పొడిగింపు

తెలంగాణలో వైన్‌ షాపుల లైసెన్స్‌ గడువును ప్రభుత్వం పొడిగించింది. అక్టోబర్‌ 31తో ముగియనున్న లైసెన్స్‌ గడువును నవంబర్‌ 30 వరకు పెంచింది. రాష్ట్రంలో 2,200కు పైగా వైన్‌షాపులు ఉండగా.. వాటి లైసెన్స్‌ గడువు అక్టోబర్‌ 31తో ముగియనుంది. కరోనా నేపథ్యంలో తమకు నష్టం వాటిల్లిందని, ఇందుకు పరిహారంగా గడువు పొడిగించాలని వైన్‌షాప్‌ యాజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో లెసెన్స్‌ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్జిన్‌ శాతాన్ని కూడా 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బార్ల యజమానులు ఈ నెల 30లోగా మొదటి త్రైమాసిక లైసెన్స్‌ ఫీజును చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండిః ప్రధాని మోదీకి బర్త్ గిఫ్ట్.. 2 కోట్ల టీకాలు పంపిణీ

Advertisement

తాజా వార్తలు

Advertisement