Wednesday, April 24, 2024

ఏపీలో చంద్రబాబుకే రక్షణ కరువైందిః మాజీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్య

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి ముట్టడికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే కొనసాగుతోంది. దీంతో తన వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు స్పందించారు.

తాను సీఎం జగన్ ను తిట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కావాలనే వైసీపీ నేతలు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. చెత్తపై పన్ను వేసినవారిని చెత్త పాలన అంటే తప్పా ? అని ప్రశ్నించారు. నిరంతరం బూతులు మాట్లాడే మంత్రిని బూతుల మంత్రి అనడం తప్పా ? అని నిలదీశారు. తాను ప్రభుత్వ విధానాలపై మాట్లాడాను తప్పా.. వ్యక్తిగతంగా మాట్లడలేదన్నారు. తనను అరెస్టు చేసినా సిద్ధమేని స్పష్టం చేశారు.

బూతుల మంత్రి కొడాలి నాని ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చంద్రబాబుని ఎన్ని అన్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే రక్షణ కరువైందన్న అయ్యన్న.. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా రక్షించబడుతాయో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ 24 గంటల ముందే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని బహిరంగంగా చెప్పినా బందోబస్తు చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు నిదర్శనమని విమర్శించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement