Monday, April 29, 2024

Chennur : పోడు రైతులకు పట్టాలు అందజేసిన విప్ బాల్క సుమన్

చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పొడుభుముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పట్టాలను అందజేశారు. నియోజకవర్గంలోని 1190 ఎకరాల్లో 666 మంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలను అందజేశారు. పట్టాలు అందని అర్హులైన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి పట్టాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement