Thursday, April 25, 2024

లెక్చరర్లు కాలేజీకి రావాల్సిందే…విద్యా శాఖ కీలక నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ కాలేజీలను తాత్కాలికంగా మూసివేసినప్పటికీ లెక్చరర్లు మాత్రం కాలేజీలకు రావాల్సిందేనని విద్యా శాఖ పేర్కొంది.

ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని… విద్యార్థులకు వాట్సాప్,జూమ్ ద్వారా నివృత్తికోసం కాలేజీలో అందుబాటులో ఉండాలని విద్యాశాఖ తెలిపింది. కాగా స్కూల్స్ విషయంలో మాత్రం టీచర్లు పాఠశాలకు రావాలా వద్దా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement