Monday, April 29, 2024

స‌ర‌స్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల క‌ట్ట‌లు… ఎక్క‌డంటే….

ఓ స‌ర‌స్సులో రూ.2వేల నోట్ల క‌ట్ట‌లు భారీగా కొట్టుకొచ్చాయి.. అయితే ఆ నోట్ల క‌ట్ట‌లు మొత్తం 30 నుంచి 32నోట్ల క‌ట్ట‌టుంటాయి… రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్​ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్​ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్లు అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement