Friday, April 26, 2024

మన మార్కెట్లకు ఏమైంది!? 7 ఏళ్ల తరువాత తొలిసారి భారీ క్షీణత

న్యూఢిల్లి : భారతీయ దేశీయ మార్కెట్లు భారీగా దిగజారిపోతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు అయితే ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో క్షీణించాయి. ఒక ఏడాది కాలంలో ఇంత భారీగా ఈక్విటీ మార్కెట్ ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక వృద్ధి, లాభాల స్వీకరణను అందించే వేదికను నిర్మాంచామని స్వామినాథన్‌ తెలిపారు. హైదరాబాద్‌ తమకు అత్యంత కీలకమైన నగరాల్లో ఒకటన్నారు. మీషోపై చేరిన విక్రేతల సంఖ్య పరంగా 8 శాతం వృద్ధిని ఇక్కడ నమోదు చూశామని వివరించారు. తాము ఇంటర్నెట్‌ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యీకరిస్తున్నామంటే.. విక్రేతలకు అత్యంత అనుకూలమైన పోటీ వాతావరణం సృష్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. 100 మిలియన్‌కు పైగా చిరు వ్యాపార సంస్థలను ఆన్‌లైన్‌లోకి విజయవంతంగా తీసుకురావాలనే లక్ష్య సాకార దిశగా వెళ్లనున్నామన్నారు. హైదరాబాద్‌ మీషో విక్రేత రాఘవేందర్‌ మాట్లాడుతూ.. సాఫ్ట్‌ బ్యాంక్‌ వెన్నంటి ఉందని తెలిసిన తరువాత.. మీషో వేదికపై చేరినట్టు తెలిపాడు. వినియోగదారుల అనుకూల ఆన్‌ బోర్డింగ్‌ ప్రక్రియ పూర్తి ఉప యుక్తంగా ఉంటుందని, గతంలో అసలు ఆన్‌లైన్‌ ఉనికి లేనటువంటి విక్రేతలకు ఇది మరింత సహాయకారిగా మారిందన్నారు. మీషోపై 70 శాతం మంది విక్రేతలు టైర్‌ 2 నగరాలైన అమృత్‌సర్‌, రాజ్‌కోట్‌, తిరుప్పూర్‌ లాంటి చోట్ల నుంచి ఉన్నారన్నారు. లక్ష మంది చిరు వ్యాపారవేత్తలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జనవరి 2021 నుంచి 5వేల మంది కోటీశ్వరులుగా మారారని చెప్పుకొచ్చారు. ్లు నష్టపోవడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి అని రైటర్స్‌ పోల్‌ తెలియజేస్తుంది. వడ్డీ రేట్లలో పెరుగుదలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మందగించిన వృద్ధి రేటు ఈక్విటీ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వేగంగా అయితే సూచీలు దిగజారాయో.. అంతే వేగంగా మళ్లి రికవరీ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తున్నది. ఈక్విటీ మార్కెట్లు ఇంత భారీగా నష్టపోవడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయంగా చాలానే ఉన్నాయి. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈక్విటీ మార్కెట్లను కిందికి లాగుతున్నాయి. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సప్లయ్‌ చైన్‌ను దెబ్బతీశాయి. ఆర్‌బీఐతో పాటు ఇతర దేశాల సెంట్రల్‌ బ్యాంకులు.. వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇది కూడా ఈక్విటీ మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉప సంహరించుకుంటున్నారు.

దిగజారుతున్న సూచీలు

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో మొత్తం సుమారు 7 శాతం క్షీణించింది. జనవరి 18న నమోదైన 61,475.15 పాయింట్ల గరిష్టం నుంచి చూసుకుంటే.. 12 శాతం దిగజారింది. మళ్లిd 60వేల మార్క్‌ను లేదా జనవరి 18 నాటి గరిష్టాలను స్వల్ప కాలంలోనే చేరుకుంటాయని ఊహించుకోలేమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్‌సీఐ అల్‌ కంట్రీ వరల్డ్‌ ఇండెక్స్‌తో పోల్చుకుంటే.. భారతదేశ సూచీలు చాలా తక్కువగానే క్షీణించాయని చెప్పుకోవాలి. ఈ ఏడాదిలో ఎంఎస్‌సీఐ అల్‌ కంట్రీ వరల్డ్‌ ఇండెక్స్‌ సుమారు ఏడాది కాలంలో 16 శాతం పడిపోయింది. ఈ నెల ప్రారంభంలో ఇది 20 శాతం వరకు చేరుకుంది. ఆ తరువాత స్వల్పంగా కోలుకున్నాయి. రైటర్స్‌.. 30 ఈక్విటీ వ్యూహకర్తల నుంచి కీలక సమాచారంతో పాటు అభిప్రాయాలను సేకరించింది. మే 13 నుంచి 24 మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దిగజారడంపై ఈ పోల్‌ నిర్వహించింది. సోమవారం ముగింపు 54,288.61 పాయింట్ల నుంచి.. 2022 చివరి నాటికి 3.2 శాతం మాత్రమే లాభపడి.. 56,000 చేరుకుంటుందని అంచనా వేసింది. 2015లో తొలిసారి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 4 శాతం క్షీణించింది. ఆ తరువాత ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.

మరికొంత ఇదే అస్థిరత

సమీప కాలంలో.. భారతీయ స్టాక్‌ మార్కెట్లలో అస్థిరత తొలగిపోతుందనే నమ్మకం లేదని ఆర్థిక నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఒక వైపు వడ్డీ రేట్లు ఇప్పటికే పెరిగాయి. మున్ముందుకు కూడా పెరుగుతాయనే సంకేతాల నేపథ్యంలో.. ఇంత తరగా మార్కెట్లు కోలుకుంటాయని భావించడం లేదన్నారు. దీనికితోడు ఆదాయ వృద్ధి కూడా మందగిస్తూ వస్తున్నది. ఎన్నో అస్థిరతల తరువాత.. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2023 చివరి నాటికి 60వేల పాయింట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. సల్ప కాలంలోనే తీవ్ర అస్థిరత చూస్తామని చెప్పుకొచ్చారు. 27 మందిలో 19 మంది (70 శాతం) మార్కెట్ల అస్థిరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ స్టాక్‌ మార్కెట్స్‌లో.. రానున్న మూడు నెలల కాలంలో.. అస్థిరత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గణనీయంగా అస్థిరత పెరుగుతుందని ఏడుగురు చెప్పగా.. 12 మంది స్వల్ప పెరుగుదలను అంచనా వేశారు. మిగిలిన 8 మంది…

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement