Wednesday, May 1, 2024

యాజమాన్య కోటాలో బీడీఎస్‌ సీట్ల భర్తీకి.. 20 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ప్రైవేటు దంత కళాశాలల్లో యాజమాన్య కోటా బీడీఎస్‌ ప్రవేశాలకు మాప్‌ ఆఫ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ వైద్యఆరోగ్య వి శ్వవిద్యాలయం విడుదల చేసింది. రెండవ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారీగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఇవ్వాల (సోమవారం) సాయంత్రం 4 గంటల నుండి 20వ తేది సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement