Thursday, May 16, 2024

అన్ని వర్గాలను ఆదరిస్తున్నాం: పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి

రాష్ట్రంలోని అన్ని వర్గాలను తమ ప్రభుత్వం ఆధరిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ఎన్ఎస్ గార్డెన్ లో క్రైస్తవులకు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ కానుకలు అందజేశారు. కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ క్రైస్తవులందరికీ ప్రభుత్వం ప్రతి ఏటా కానుకలు అందిస్తుందన్నారు.

హిందూ వులకు బతుకమ్మ సందర్భంగా చీరలు ముస్లిం లకు రంజాన్ సందర్భంగా కిట్లు అందిస్తున్నామన్నారు. ఈ నెల 25న క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి,ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్,పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్ భిక్షపతి, తహసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement