Sunday, May 19, 2024

Warmly Welcome – ఫ్రాన్స్ లో మోడీకి ఘ‌న స్వాగ‌తం..

ప్యారిస్ – రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్యారిస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వాగతం పలికారు. ప్యారిస్ లోని ప్రవాస భారతీయులు మోడీకి త్రివర్ణ పతాకాలతో స్వాగతం పలికారు. రేపు బాస్టిల్ డే వేడుకలో పాల్గొని, గౌరవ వందనం స్వీకరించనున్నారు భార‌త ప్ర‌ధాని. ఆ తర్వాత ప్యారిస్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ తో భేటీ కానున్నారు. ఫ్రాన్స్ ప్రధానితో పలు కీలక అంశాలపై చర్చించనునన్నారు. రక్షణ ఒప్పందాలపై సంత‌కాలు చేయ‌నున్నారు..

‘ప్యారిస్ లో అడుగుపెట్టాను. ఈ పర్యటన ద్వారా భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నా కార్యక్రమాలలో భాగంగా భారతీయులతోను భేటీ అవుతున్నాను’ అని ప్యారిస్ లో దిగిన అనంతరం మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement