హీరో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం విరూపాక్ష.ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ దండు..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ .సాయిధరమ్ తేజ్ జీప్పై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. విరూపాక్షలో మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీకి కాంతార ఫేం అంజనీశ్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్పై సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు అంజనీశ్ లోక్నాథ్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రలు నటిస్తున్నారు. విరూపాక్షతోపాటు సాయిధరమ్ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ తెలుగు రీమేక్లో నటిస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement