Thursday, May 2, 2024

ఉత్తమ రైతుగా ఎంపికైన‌ వీరారెడ్డి..

ఇబ్రహీంపట్నం, (ప్రభన్యూస్): ఉత్తమ రైతుగా ఆదిభట్ల మున్సిపాలిటీలోని చింతపల్లి గూడ అనే గ్రామానికి చెందిన బత్తుల వీరారెడ్డిప్రశాంతి దంపతులు ఎన్నికయ్యారు. సుస్థిర వ్యవసాయం పైన వనపర్తి జిల్లాలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. జిల్లాల వారీగా ఉత్తమ రైతులను గుర్తించి, రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు పురస్కారాలను అందజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల మున్సిపాలిటీ లోని చింతపల్లి గ్రామానికి చెందిన వీరారెడ్డి దంపతులను ఉత్తమ రైతుగా గుర్తించి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చేతుల మీదగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన ప్రతిష్ట పురస్కారం అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement