Friday, May 3, 2024

ఎస్ ఆర్ పెట్రోల్ బంక్…ఇచ్చట పెట్రోల్ లో సగం నీరే లభించును

అసలే పెట్రోల్ రేట్లుభగ్గుమంటున్నాయి. ఇక సామాన్య జనం పెట్రోల్ కొట్టి రోడ్డుపై తిరగాలంటే వణికిపోతున్నారు. దీనికి సరిపోదన్నట్టు కొంతమంది. పెట్రోల్ బంక్ నిర్వాహకులు పెట్రోల్ లో సగం నీళ్లు కలిపేస్తున్నారు. అది తెలియక కొంతమంది ఎందుకు బైక్ ఆగిపోయిందబ్బా అనే ఆలోచనకే పరిమితం అవుతుంటే మరికొంతమంది మాత్రం బంకులో జరుగుతున్న మోసం పట్ల గట్టిగా అడుగుతున్నారు.

ఇక తాజాగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లో నీళ్లు కలుపుతున్నారు అంటూ ఓ బాధితుడు ఆరోపించాడు. ద్విచక్ర వాహనం రిపేర్ కావటంతో మెకానిక్ దగ్గరికి తీసుకు వెళ్లాడాట. అయితే పెట్రోల్ లో నీళ్ళు ఉన్నాయని మెకానిక్ చెప్పటంతో ఆ బాధితులు వెంటనే బ్యాంకుకు వెళ్లి బాటిల్ లో పెట్రోల్ పోయించగా సగానికిపైగా నీళ్ళు ఉన్నాయట. దీనితో బంకు నిర్వాహకులతో గొడవకు దిగాడు. వీళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు ఆ బాధితుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement