Friday, May 3, 2024

పోటీ పరీక్షలకు పుస్తకాల పంపిణీ

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ పాఠకులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఈటల జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి పుస్తకాలు అందించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ గఫార్‌, గ్రంథాలయ సిబ్బంది యూనుస్‌ ఖాద్రి, ప్రేమ్‌చంద్‌, పాఠకులు ప్రశాంత్‌, రమేశ్‌, సతీష్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, రవికుమార్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement