Saturday, April 27, 2024

UP – వివాహిత‌పై సామూహిక అత్యాచారం.. అవ‌మానం భ‌రించ‌లేక భార్య‌, భ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య

లక్నో – సామూహిక లైంగిక దాడికి గురైన వివాహిత ఆ తర్వాత కొన్ని గంటలకే భర్తతో కలిసి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 20న రాత్రి ఇద్దరు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అత్యాచారం గురైన తర్వాత 30 ఏళ్ల భర్త, 27 ఏళ్ల అయన భార్య విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోలో నిందితుల పేర్లను బాధితులు వెల్లడించారు. భర్త అదే రోజు మరణించగా, గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదర్శ్ (25), త్రిలోకి (45)ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement