Tuesday, May 14, 2024

వ‌చ్చే వారం నుంచి తిరిగి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

అమ‌రావ‌తి – టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చేవారం నుంచి ప్రారంభించ‌నున్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో లోకేష్ నేడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ ఇటు యువగళంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు లోకేష్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement