Saturday, April 27, 2024

అన్ స్టాపబుల్ లో మంచు వారి ఫ్యామిలీ..ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన బాల‌య్య‌..

వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తున్నారు ప‌లువురు స్టార్స్. ఇప్ప‌టికే ఎన్టీఆర్..నాగార్జున‌..చిరంజీవి..నాని ఇలా ప‌లువురు బుల్లితెర‌పై సంద‌డి చేశారు. కాగా ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ బుల్లితెర‌పై క‌నిపించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం బాల‌య్య ఈ నిర్ణ‌యం తీసుకున్నారు… నందమూరి బాలయ్య తో అన్ స్టప బుల్ టాక్ షో నూ స్టార్ట్ చేస్తున్నారు ఆహా వారు. తాజాగా ఈ షో కు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ ప్రోమోను విడుదల చేసింది ఆహా సంస్థ‌. అయితే.. బాలయ్య షోలో మొదటి గెస్ట్‌ గా డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు వచ్చారు. మోహన్‌ బాబుతో పాటు మంచు విష్ణు మరియు లక్ష్మి ప్రసన్న కూడా ఈ షోలో సందడి చేయ‌డం విశేషం.

మ‌రి బాల‌య్య‌..మోహ‌న్ బాబులు క‌లిస్తే ఎంట‌ర్ టైన్ మెంట్ కి కొద‌వేం ఉంటుంది. రాజ‌కీయ‌..సినిమా..ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు ప‌లు ప్ర‌శ్న‌లు వేసి జ‌వాబుల‌ను రాబ‌ట్టారు బాల‌కృష్ణ‌. మెగాస్టార్ చిరంజీవితో రిలేషన్‌ షిప్‌ పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే… టీడీపీ పార్టీ పై కూడా బాలయ్య మరియు మోహన్‌ బాబు మధ్య ప్రస్థావన వచ్చింది. అటు మంచు విష్ణు మరియు లక్ష్మి ప్రసన్న కామెడీతో ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలు రాక ప‌డిన ఇబ్బందుల‌ను మోహ‌న్ బాబు తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement